Friday, May 17, 2024

Breaking : మంత్రి సత్యవతి కాన్వాయ్ కు ప్రమాదం – త‌ప్పిన ముప్పు

మరిపెడ, (ప్రభ న్యూస్): శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో మరిపెడ మున్సిపల్ కేంద్రంలో కార్గిల్ సెంటర్ సమీపంలో రాగానే కాన్వాయ్ పంది అడ్డు రావటంతో సడెన్ బ్రేక్ వేయగా వెనక వస్తున్న మరో వాహనం వేగంగా ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గన్ మేన్ ల‌కు స్వల్ప గాయాలు కాగా.. మంత్రి సత్యవతి సురక్షితంగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని వాహనాలను క్లియర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement