ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి 200మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదం హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఆర్మీ జవాన్ కూడా ఉన్నారు. కైడి గ్రామపంచాయతీ పరిధిలోని భరంత్ నుంచి నర్వ వైపు వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. నర్వ మార్కెట్కు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మృతులను ఆర్మీ జవాన్ లక్కీ, కాలేజ్ విద్యార్థి అక్షయ్ (23), స్కూల్ విద్యార్థులు ఆశిష్, రితిక్లుగా గుర్తించారు. బాధితులందరూ నర్వ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement