Saturday, May 4, 2024

Breaking : ఏపీ థియేట‌ర్స్ లో 100శాతం ఆక్యుపెన్సీ – గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన స‌ర్కార్

ఏపీ థియేట‌ర్ల‌లో వంద శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు తాజాగా అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది ఏపీ ప్ర‌భుత్వం. ఈ ప్రకటన ప్రకారం రేపటి నుంచి ఏపీలో 100% ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడవనున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో గత నెల రోజుల క్రింద 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడవాలని జ‌గ‌న్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి కేసులు గత పది రోజుల నుంచి క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల పై ఆంక్షలు ఎత్తి వేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement