Saturday, May 18, 2024

వైసీపీది ఉగ్రవాదులను మించిన పాలన: చంద్రబాబు

వైసీపీది రాక్షసులు, ఉగ్రవాదులకు మించిన పాలన అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సర్పంచ్‌ల అవగాహన సదస్సులో చంద్ర బాబు మాట్లడారు. సర్పంచ్‌లకు అధికారం లేకుండా చేశారని మండిపడ్డారు. సర్పంచ్‌లకు రాజ్యాంగం హక్కులు కల్పించిందన్నారు. సర్పంచ్‌ అధికారాలను తీసుకోవడానికి జగన్‌ ఎవరని ప్రశ్నించారు. హక్కుల కోసం వారు చేసే పోరాటానికి టీడీపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా వైసీపీ మార్చిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయోద్దని వైసీపీ హుకం జారీ చేసిందన్నారు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేయనివ్వలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement