Monday, April 29, 2024

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు కి సుకుమార్ వాయిస్ – థ్యాంక్స్ చెప్పిన చిత్ర మేక‌ర్స్

ఎల్లుండి రిలీజ్ కానుంది ఆడ‌వాళ్లు మీకు జోహార్లు చిత్రం. ఈ చిత్రంలో హీరోగా శ‌ర్వానంద్, హీరోయిన్ గా రష్మిక న‌టిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ శర్వానంద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ అందించారు. డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీకి ప్రత్యేకంగా వాయిస్ అందించార‌ట‌. మరోవైపు డైరెక్షన్ లోనూ సహకరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ సుకుమార్ కు సోషల్ మీడియా వేదికన ధన్యవాదాలు తెలిపారు. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీకి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుజిత్ సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ మూవీని మార్చి 4న రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement