Friday, April 26, 2024

ఏపీలో బెయిల్ పై ఉన్న నేత‌లు – జైలుకి వెళ్ళ‌డం ఖాయం ‘ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్’

వైసీపీ,టీడీపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని బిజెపి అగ్ర‌నేత ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఆరోపించారు. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన ప్ర‌జాగ్ర‌హ స‌భ‌కి ఆయ‌న హాజ‌ర‌య్యారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పోల‌వ‌రానికి అన్ని అనుమ‌తులు వ‌చ్చాయ‌ని చెప్పారు. అనుమ‌తులు ఇచ్చి ఏడు సంవ‌త్స‌రాలు అయినా పోల‌వ‌రం పూర్తి చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. అమ‌రావ‌తి కోసం అట‌వీభూముల‌ను బ‌దిలీ చేశామ‌న్నారు. తాను కేంద్ర‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఏపీలో కొన్ని స‌మ‌స్య‌లు గుర్తించాన‌న్నారు. ఏపీలో చాలామంది నేతలు బెయిల్ పై బయట ఉన్నారని జవదేకర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారని అన్నారు.

రాష్ట్రంలో మద్య నిషేధం అని చెప్పి, ఇప్పుడు మద్యంపై వచ్చే డబ్బుతోనే పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. అయోధ్యలో గొప్పగా రామాలయం నిర్మిస్తున్నామన్నారు. వారణాసి, చార్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాల రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. ఏపీలో పరిస్థితి బాగా లేదని, అంతర్వేదిలో రథం దగ్ధమైందని, రామతీర్థంలో స్వామివారి విగ్రహాన్ని విరగ్గొట్టారని మండిపడ్డారు. కాగా, ప్రకాశ్ జవదేకర్ ఆంగ్లంలో ప్రసంగించగా, పురందేశ్వరి తెలుగులో అనువదించారు. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్… ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలది అవినీతి పాలనే అని ఆరోపించారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందని తెలిపారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement