Monday, May 6, 2024

ఆంధ్రా వారి ఓట్లు కావాలి.. కానీ వారికి వైద్యం అందించరా?

తెలంగాణ ప్రభుత్వంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. ఏపీ వారి ఓట్లు కావాలి కానీ.. వాళ్ళకు వైద్యం మాత్రం అందించరా? అంటూ సీఎం కేసీఆర్‌ను రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను ఆపడం సరైన చర్య కాదని మండిపడ్డారు. హైదరాబాద్ మెడికల్ హాబ్ అని సీఎం కేసీఆర్ అంటారు.. హైదరాబాద్ వైద్యం కోసం వస్తే.. నిబంధనలు పెడతారా ? అంటూ నిలదీశారు. ఏపీ నుంచి వచ్చే రోగులను ఆపడం చాలా దారుణమన్నారు. కాగా తెలంగాణ సరిహద్దు పుల్లూరు చెక్ పోస్టు వద్ద పెద్దఎత్తున ఏపీ అంబులెన్సులు బారులు తీరాయి. అవి హైదరాబాద్ వెళ్లేందుకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. పడిగాపులు కాచి అంబులెన్సులోనే ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement