Monday, April 29, 2024

Affair | ప్రియుడిపై మోజు.. కట్టుకున్న భర్తనే ఖతం చేయించింది!

ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు.. సొంత భర్తనే మర్డర్​ చేయించింది. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని మహదేవ్​​పురాలో జరిగింది. ఆ మహిళకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. అయినా, వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇది తెలిసి ఆమె భర్త ప్రశ్నించడంతో ప్రియుడితో  చెప్పి ఈ లోకంలోనే లేకుండా చేసింది. ఇక.. ప్రియురాలి మాటలు విని మర్డర్​ చేసిన వ్యక్తి కటకటాలు లెక్కిస్తున్నాడు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహదేవ్​పురా నివాసి అయిన ఉదయ్​కుమార్​ హత్యకు గురయ్యాడు. నిన్న (గురువారం) అతని భార్య లవర్​  చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్టు చేసి మహదేవపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతుడు ఉదయ్ కుమార్ వృత్తిరీత్యా బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య ప్రియ.. అన్వర్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే.. అన్వర్​ తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీంతో తనకు  ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారని, తన భర్త ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటానని మదనపడింది. అన్వర్ పెళ్లి ప్రతిపాదనకు ప్రియా నో చెప్పింది. అయితే.. అన్వర్‌తో మాత్రం ఆ తరహా స్నేహం కొనసాగిస్తోంది.

- Advertisement -

ఇక.. తన భర్త రోజూ మద్యం తాగి తనను కొట్టేవాడని అన్వర్​తో చెప్పుకుని విలపించేది. కాగా, గురువారం రాత్రి అన్వర్​ ఉదయ్‌కు ఫోన్‌ చేసి భార్యపై దాడి చేయడంపై ప్రశ్నించాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత అన్వర్ ఉదయ్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. హత్య వెనుక ప్రియ పాత్ర ఉందని, దీనిపై కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement