Wednesday, May 1, 2024

ఆనందయ్య కరోనా మందుపై బాబు గోగినేని సెటైర్లు

కరోనా విలయ తాండవం చేస్తున్న వేల నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య తయారు చేసిన మందు భలే పని చేస్తుందనే ప్రచారం సంచలనంగా మారింది. అయితే దీనిపై ప్రభుత్వం విచారిస్తుండటం, మందులో ఏం వాడుతున్నారు, దాని వల్ల ఎలాంటి ప్రభావం ఉందనే దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇంతలోనే హేతువాది, బిగ్ బాస్ ఫేమ్ బాబు గోగినేని ఆనందయ్య మందుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు ఆనందయ్య ఇస్తున్నది మందే కాదని.. చట్నీ అని బాబు గోగినేని వ్యాఖ్యానించారు.

39 కేసులు ఉన్నా కృష్ణపట్నంలో కేసులు లేవు అని ప్రచారం చేస్తున్నారని బాబు గోగినేని ఆరోపించారు. తాను చేసిన వంటకాన్ని ‘మందు’ అని మాజీ సర్పంచ్ ఆనందయ్య చెప్పుకోవడం, ఎవరూ ప్రశ్నిచకపోవడంతో పుట్టిన ఉన్మాదం ఇది అని మండిపడ్డారు. అనందయ్యను నమ్మి మాస్క్ తీసేసిన వాడికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఆస్పత్రి బెడ్‌ను వదిలేసి మరీ గుంపులుగా ఒకచోట గుమికూడి ఇతరులకు నష్టం చేకూరుస్తున్నారని ఆనందయ్యపై మండిపడ్డారు. అంటువ్యాధులు ప్రబలుతున్న కాలంలో ఇలాంటి ప్రవర్తన ప్రమాదకరమన్నారు. ‘వైరస్ సోకిన తరువాత 14 రోజులకు సాధారణంగా నెగటివ్ వస్తుంది.. ఎందుకంటే వైరస్ జీవిత కాలం అది కాబట్టి. జలుబు లాగానే. 12వ రోజు నెల్లూరుకి వచ్చి చట్నీ తిని రెండు రోజుల్లో నెగిటివ్ అంటే అది దేనికీ రుజువు కాదు’ అని వివరించారు. దేశ ఉపరాష్ట్రపతి చెప్పినా ICMR రావడంలేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని బాబూ గోగినేని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement