Thursday, May 2, 2024

Big Breaking | భట్టికి బాగాలేదు.. ఎండలకు వడదెబ్బకొట్టింది

కాంగ్రెస్​ కీలక లీడర్​, సీఎల్పీ నేత అయిన మల్లు భట్టి విక్రమార్క ఆరోగ్యం బాగాలేదు. పీపుల్స్​ మార్చ్​ పాదయాత్రలో భాగంగా ఆయన ఇవ్వాల (మంగళవారం) నల్గొండ జిల్లాలో పర్యటిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. నకిరేకల్​ మండలం కేతపల్లిలో భట్టికి వడదెబ్బ సోకింది. ఇవ్వాల్టికి 97రోజుల పాదయాత్రను ఆయన పూర్తి చేసుకున్నారు.

కాగా, భట్టి విక్రమార్కకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పారు. ప్రమాదకరమైన ఎండలో పాదయాత్ర చేయడం వల్ల బాడీ డీహైడ్రేట్​ అయ్యిందని, షుగర్​ లెవల్స్​ తగ్గిపోయినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు కాస్త బ్రేక్​ ఇవ్వాలని భట్టి నిర్ణయించుకున్నారని, ఆరోగ్యం కుదుటపడగానే యథావిధిగా పీపుల్స్​ మార్చ్​ సాగుతుందని ఆయన సన్నిహితులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement