Sunday, April 28, 2024

బైంసా పాకిస్తాన్ లో ఉందా ? .. బండి సంజ‌య్ ప్రశ్న

లవ్ జిహాద్ ఆధారంగా వచ్చిన ది కేర‌ళ స్టోరీ సినిమాకు బైంసాలో సాయంత్రం, రాత్రి షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు. ‘ది కేరళ స్టోరీ’ మూవీపై దేశవ్యాప్తంగా వివాదం నడుస్తుంది. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ది కేరళ స్టోరీ మూవీ పై పోలీసులు ఆంక్షలు విధించారు. మార్నింగ్, మ్యాట్నీ షోలకు మాత్రమే అనుమతి ఇచ్చి.. సాయంత్రం, రాత్రి షోలకు అనుమతి ఇవ్వలేదు.

బైంసా సున్నితమైన ప్రాంతం కావడంతో రెండు రోజులపాటు ప్రదర్శనను నిలిపివేశారు. దీంతో బిజెపి కార్యకర్తలు, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టగా.. నేడు ఈ సినిమా ప్రదర్శన పై విధించిన ఆంక్షలను సడలించారు. నేటి నుంచి రెండు షోలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బైంసా ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉందా..? అని ప్రశ్నించారు. బైంసా సంగతి చూస్తామని, అక్కడ ఏం జరగాలో అదే జరుగుతుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement