Saturday, May 4, 2024

Breaking: భగత్ సింగ్ పోరాటం చేసిన నేల పంజాబ్ : సీఎం కేసీఆర్

దేశం కోసం పంజాబ్ ఎంతో చేసిందని.. భగత్ సింగ్ పోరాటం చేసిన పంజాబ్ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చండీగఢ్ లో కేసీఆర్ మాట్లాడుతూ… చనిపోయిన వారిని మనం వెనక్కి తీసుకురాలేమన్నారు. మీ వెంట మేమున్నాం.. దేశమంతా ఉందన్నారు. మీ ఉద్యమం కారణంగానే కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రోజుకు పది మంది రైతులు చనిపోయేవారన్నారు. కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామన్నారు. 75ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశ పరిస్థితి చూస్తే దుఖం వస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర సమస్యలున్నాయన్నారు. కేంద్రం ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకునేలా రైతులు పోరాడారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement