Friday, April 26, 2024

బెంగాల్ లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి: బండి దీక్ష

పశ్చిమబెంగాల్ లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బెంగాల్ లో బీజేపీ కార్యకర్తల పై దాడికి  నిరసనగా తెలంగాణ బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు దీక్ష చేపట్టారు. బెంగాల్ లో ప్రజాస్వామ్యని పరిరక్షించాలని ప్లకార్డుల ప్రదర్శించారు. ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతపై బండి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్ లో ప్రజలు సంతోషంగా లేరని బండి అన్నారు. మహిళలపై, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. బెంగాల్ లో జరుగుతున్న దాడులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై దాడులపై మమత సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement