Monday, April 29, 2024

Bandi Sanjay: పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకుండా మాపై విమర్శలా?:

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో కేవలం బీజేపీని టార్గెట్ చేశారని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారని మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించకుండా… కేంద్ర ప్రభుత్వం పైనే విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబం మాత్రం సంపాదించుకుందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ఆస్తులు వెయ్యి కోట్లు అని కేసీఆర్ చెప్పారని… మరి కేసీఆర్ ఆస్తులు ఎంతని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని టీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. దేశానికి కేన్సర్ లా మారిన ఎంఐఎంను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement