Monday, May 6, 2024

FLASH: దేశాన్ని అధోగతి పట్టిస్తున్న బీజేపీ పాలన.. బాల్క సుమన్ ట్వీట్ వైరల్

బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫోటోని షేర్ చేశారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్యాస్ ధరలను భారీగా పెంచడంతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు గ్యాస్ స్టవ్ లను అటకెక్కించి కట్టెల పొయ్యి పైన వంట సాగిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న సిలిండర్ ను స్టూల్ గా మార్చుకున్న ఫోటోను బాల్క సుమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement