Sunday, May 5, 2024

బాబూ జగ్జీవన్ రామ్‌కు లోకేష్ ఘన నివాళి

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్  జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘనంగా నివాళి అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూనే సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పారు. దళితుల హక్కుల అమల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు వారు విద్యావంతులుగా, ఆత్మాభిమానం కలిగిన వారిగా ఉండాలని జీవితాంతం పరితపించారన్నారు. బాబు జగ్జీవన్ రామ్ నిర్వహించిన ప్రతి పదవితో వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మార్గదర్శి అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement