Wednesday, May 15, 2024

సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్నారు- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

తెరాస ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆకర్షితులై గులాబీ దండులో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తెరాసలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు. గత పాలకుల హయాంలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. నియోజకవర్గంలోని పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement