Saturday, April 27, 2024

వికారాబాద్ జిల్లాలో దారుణం… భార్య‌ను చంపి ఆపై భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌..

క‌ట్టుకున్న భార్య‌నే క‌డ‌తేర్చాడు.. ఆపై తాను కూడా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కావలి భీమయ్య (50) అనే వ్యక్తి నిద్రిస్తున్న భార్య పెంటమ్మ (45) గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం భీమయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసుల‌కు భార్య‌భ‌ర్త‌ల గురించి ఆరా తీశారు. అనంత‌రం మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement