Sunday, April 28, 2024

Big Breaking | సికింద్రాబాద్​లో దారుణం.. తండ్రి చనిపోయాడన్న మనస్తాపంతో ముగ్గురు ఆత్మహత్య

హైదరాబాద్​లోని సికింద్రాబాద్​లో దారుణం జరిగింది. భవానీ నగర్​లో ఓ ఫ్యామిలీలోని ముగ్గురు ఉరేసుకుని చనిపోయిన ఘటన ఇవ్వాల (మంగళవారం) వెలుగులోకి వచ్చింది. కుటుంబంలోని సభ్యులు వేర్వేరు గదుల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో తల్లి విజయలక్ష్మి, కూతుళ్లు సౌజన్య, చంద్రకళ చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.

కాగా, తండ్రి చనిపోయాడన్న కారణంతోనే వీరంతా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో సౌజన్య దివ్యాంగురాలుగా తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని పోలీసులు, కుటుంబ సభ్యులు కూడా గోప్యంగా ఉంచారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement