Saturday, April 27, 2024

చైనాలో భారీ పేలుడు ​.. 12 మంది మృతి

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. హుబే ప్రావిన్స్ లోని షియాన్ నగరంలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. 138 మందికి గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 6:30 గంటలకు ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో మరో 37 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శిథిలాల కింద ఎంతో మంది చిక్కుకుపోయారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు దాదాపు 150 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

 


Advertisement

తాజా వార్తలు

Advertisement