Saturday, May 4, 2024

అగంత‌కుడు క‌త్తితో దాడి-న‌లుగురికి గాయాలు

ఓ అగంతకుడు క‌త్తితో దాడికి పాల్ప‌డ్డాడు..ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. చైనాలోని షాంఘైలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. గాయ‌ప‌డ్డ‌వారిని రుయిజిన్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క‌త్తితో దాడి ఘ‌ట‌న నేప‌థ్యంలో హాస్పిట‌ల్ వ‌ద్ద గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ అయ్యాయి. హాస్పిట‌ల్ వ‌ద్ద ఉన్న మార్బుల్ స‌ర్ఫేస్‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు క‌నిపించాయి. షాంఘై హాస్పిట‌ల్‌లోని ఏడ‌వ అంత‌స్తు వ‌ద్ద ఆగంత‌కుడు త‌న వ‌ద్ద ఉన్న క‌త్తితో బెదిరిస్తూ కొంద‌ర్ని బంధీ చేశాడు. ఆ స‌మ‌యంలో పోలీసులు అత‌నిపై కాల్పులు జ‌రిపారు. క‌త్తి దాడిలో గాయ‌ప‌డ్డ ఓ వ్య‌క్తి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న‌ను విచారిస్తున్న‌ట్లు పోలీసులు చెప్పారు. రుయిజిన్ హాస్పిట‌ల్‌కు చెందిన అన్ని అపాయింట్‌మెంట్ల‌ను ర‌ద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement