Sunday, May 5, 2024

300 సీట్లు గెలిస్తేనే ఆర్టిక‌ల్ 370 పున‌రుద్ధ‌ర‌ణ.. గులాం న‌బీ ఆజాద్

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ ఆర్టిక‌ల్ 370 పున‌రుద్ధ‌ర‌ణ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ను పునరుద్ధరించాలంటే కాంగ్రెస్‌ వల్ల అయ్యే పని కాదని .. ఎందుకంటే 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 300 స్థానాల్లో గెలుపొందితేనే అది అసాధ్యమని ఆయ‌న‌ అన్నారు. జమ్మూ-కాశ్మీరులోని పూంఛ్‌ జిల్లా కృష్ణఘాటి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో ఆయ‌న‌ మాట్లాడుతూ…అధికరణ 370 రద్దును కేవలం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవని ఆయన పేర్కొన్నారు.

తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 300 మంది ఎంపీలు అవసరమ‌ని, 2024 ఎన్నికల్లో 300 మంది ఎంపీలు గెలుపొందాలన్నారు. అప్పుడే ఆర్టికల్‌ 370ని పునరిద్ధరించగలమ‌న్నారు. అంత మంది ఎంపీలు గెలిచేదేప్పుడని.. ప్రస్తుతం ఆ పరిస్థితి కాంగ్రెస్‌లో కనిపించడం లేదని, అందుకే అధికరణ 370ని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేయలేనని ఆజాద్‌ వ్యాఖ్యానించారు. దీంతో కాశ్మీర్‌లో కాంగ్రెస్‌ ఓట్లను కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆజాద్‌ అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్‌ గత వైభవాన్ని సాధించలేకుంటే ఇకపై కష్టతరంగా మారుతుందన్నారు. కేవలం ఒక్క జమ్ము కాశ్మీర్ కాదు.. దేశంలో అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్‌ పట్టును కోల్పోతుందని ఆజాద్‌ వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement