Thursday, May 16, 2024

ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం జగన్

ఏపీకి ఆక్సిజన్‌ సరఫరా పెంచాలని కోరుతూ ఏపీ సీఎం జగన్‌ మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాయలసీమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జామ్‌నగర్ నుంచి ప్రతిరోజూ 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపాలని లేఖలో కోరారు. అటు జామ్‌ నగర్‌ నుంచి ఏపీకి ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నందుకు జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి గతంలో కంటే ఇప్పుడు ఆక్సిజన్‌ సరఫరా పెంచినందుకు, 7 కంటైనర్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్స్‌ 30 వేలకు పెంచామని, రోజూ 910 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అవసరం ఉందన్నారు.

విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌ నుంచి కేటాయించిన 170 మెట్రిక్ టన్నులకు బదులు 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే వస్తోందన్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి ఏపీకి కేటాయిచిన మేర ఆక్సిజన్‌ రావడం లేదని సీఎం జగన్‌ గుర్తుచేశారు. దీంతో రాయలసీమలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరాకు ఇబ్బంది కలుగుతోందన్నారు. జూమ్‌ నగర్‌ నుంచి పంపిన 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మరో రెండురోజులు రాలయసీమలో ఉపయోగపడుతుందనే విషయాన్ని జగన్‌ లేఖలో తెలిపారు. ఒడిశా నుంచి ఏపీకి కేటాయించిన ఆక్సిజన్‌ తెచ్చుకునేందుకు పూర్తిగా కృషి చేస్తున్నామని సీఎం జగన్‌ లేఖలో వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement