Friday, May 3, 2024

కరోనాపై పోరులో రంగంలోకి దిగిన ఇస్రో

దేశ ప్రజలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌తో పోరాడేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కూడా రంగంలోకి దిగింది. కరోనా రోగుల కోసం శ్వాస్‌ పేరుతో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను, ప్రాణ పేరుతో వెంటిలేటర్‌ను అత్యంత తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసింది. ఇస్రోకు చెందిన యువ శాస్త్రవేత్తలు వీటిని రూపొందించారని, వీటి ధర బహిరంగ మార్కెట్‌లో కంటే తక్కువే ఉండేలా తయారుచేశామని తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ తెలిపారు. వీటి టెక్నాలజీని తయారీ సంస్థలకు ఉచితంగా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే పలు సంస్థలు తమను సంప్రదించాయన్నారు. ‘ప్రాణ’ ధరను సుమారు లక్ష రూపాయలు (మార్కెట్‌ ధరతో పోలిస్తే మూడింతలు తక్కువ), ‘శ్వాస్‌’ ధరను రూ. 50 వేల లోపే అందజేస్తామని చెప్పారు. శ్వాస్‌ నిమిషానికి పది లీటర్ల ఆక్సిజన్‌ను అందిస్తూ ఏకకాలంలో ఇద్దరు రోగులకు ప్రాణవాయువును అందజేస్తుందని వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలను అనుసరించి వీటిని రూపొందించామని సోమ్‌నాథ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement