Saturday, April 27, 2024

Spl Story: 62 ఏళ్ల వయసులో మరో పెళ్లి.. వివాదాల సుడిగుండంలో నరేశ్​ లవ్​!

సీనియర్​ నటుడు నరేశ్​ పెళ్లి వ్యవహారం సోషల్​ మీడియాలో సంచలనంగా మారింది. అటు రోజుకో బ్రేకింగ్​, పూటకో స్పెషల్​ స్టోరీతో ఎలక్ట్రానిక్​ మీడియా కొత్త కొత్త విషయాలను వండి వారుస్తోంది. లేట్​ వయసులో మరో పెళ్లి చేసుకోవడం.. నటి పవిత్ర లోకేష్​తో లవ్​ ఎఫైర్​ అనే అంశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి…

దివంగ‌త న‌టి..ద‌ర్శ‌కురాలు విజయనిర్మల మొదటి భర్త కుమారుడు నరేష్.. బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. 1982లో విడుదలైన నాలుగు స్తంభాలాట మూవి తో హీరోగా మారాడు. నరేష్ పుట్టింది, పెరిగింది సినిమా ప్రపంచంలోనే. ఈ క్రమంలో ఆయన ఆలోచనలు, అలవాట్లు కొంచెం మోడ్రన్ గా ఉండేవి. 80లలో ఓ మోస్తరు హీరోగా నరేష్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక యుక్త వయసులోనే నరేష్ వివాహం జరిగింది. ఇండస్ట్రీకి చెందిన శ్రీను అనే వ్యక్తి కూతురిని నరేష్ వివాహం చేసుకున్నారు. వీరికి నవీన్ విజయ్ కృష్ణ కొడుకు. నవీన్ ఒకటి రెండు చిత్రాలలో హీరోగా నటించారు.

నవీన్ పుట్టాక నరేష్ భార్య అనారోగ్యం బారినపడ్డారు. ఈ కారణంగా నరేష్ ..నవీన్ తల్లికి విడాకులు ఇచ్చారు. అనంతరం ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలైన రేఖా సుప్రియను వివాహం చేసుకున్నారు. వీరికి కూడా ఒక కొడుకు పుట్టాడు. కొన్నేళ్ల కాపురం తర్వాత రేఖా సుప్రియతో కూడా నరేష్ విడిపోయారు. కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న నరేష్ మూడో వివాహం రమ్య రఘుపతితో జరిగింది..2010లో నరేష్-రమ్య వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. మూడో భార్యతో నరేష్ విడిపోయిన విషయం చాలా కాలం బయటికి రాలేదు.

- Advertisement -

ఇటీవల రమ్య ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె కొందరు వ్యక్తుల నుండి నరేష్, కృష్ణ కుటుంబం పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని కేసు నమోద‌యిన సంగ‌తి తెలిసిందే. ఆ సమయంలో నరేష్ ఓ వీడియో బైట్ విడుదల చేశారు. రమ్య రఘుపతి నేను విడిపోయి చాలా కాలం అవుతుంది. ఆమె ఇప్పుడు నా భార్య కాదు. రమ్య నేరాలతో నాకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అప్పుడు నరేష్ మూడో భార్యతో కూడా విడిపోయారన్న విషయం బయటికి వచ్చింది. ఇక నరేష్ ..రమ్యపై దారుణమైన ఆరోపణలు చేశారు. ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని, డబ్బుల కోసం వేధించారని, బ్లాక్ మెయిల్ చేశారని పలు ఆరోపణలు చేశారు. ఆ కారణంగానే రమ్యతో విడిపోయినట్లు నరేష్ వెల్లడించారు. ఇక రమ్య మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడు కూతురు.

తాజాగా న‌టి పవిత్ర లోకేష్ తో న‌రేష్ రిలేష‌న్ పై ప‌లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆమెతో నరేష్ చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. తమ మధ్య గొడవలకు పవిత్రనే కారణమంటూ రమ్య ఆరోపిస్తుంది. నరేష్, పవిత్రలు చట్టబద్దంగా పెళ్లి చేసుకొనే ఆలోచనలో లేరు. వారి లేటెస్ట్ కామెంట్స్ ద్వారా ఈ విషయం అర్థమవుతుంది. అయితే నరేష్ ఏకంగా వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం లేదంటున్నారు. మేం సహజీవనం చేస్తున్నాం, పెళ్లి చేసుకోలేదని పవిత్ర ఓపెన్ గా చెబుతున్నారు.

సో ఇవన్నీ గమనిస్తుంటే మనస్పర్థలు రానంత వరకు కలిసి బతకాలని వారు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ చట్టపరంగా వీలు కాదు. రమ్యకు విడాకులు ఇవ్వకుండా నాలుగో వివాహం చేసుకోవడం కుదరదు. అంతేకాకుండా బెంగ‌ళూరులోని ఓ హోట‌ల్ లో రెడ్ హ్యాండెడ్ గా న‌రేష్ మూడోభార్య ర‌మ్యకి దొరికారు న‌రేష్..ప‌విత్ర లోకేష్‌. మ‌రి ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement