Wednesday, May 1, 2024

Breaking: యూపీలో మ‌రో ఘ‌ట‌న‌.. కుప్ప‌కూలిన పాత వంతెన‌, త‌ప్పిన పెను ప్ర‌మాదం

గుజరాత్‌ రాష్ట్రంలోని మోర్బీలో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలి 132 మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మరువకముందే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇవ్వాల (సోమ‌వారం) అట్లాంటిదే మరో ఘటన జరిగింది. యూపీలోని చందౌలి జిల్లా సరయ్యా గ్రామంలో ఛఠ్ పూజ సందర్భంగా ఓ కాలువపై నిర్శించిన బ్రిడ్జిపైకి జనం పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. పాతబడిన ఆ వంతెన బరువును త‌ట్టుకోలేక ఒక్క‌సారిగా కుప్పకూలింది. అయితే.. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణాపాయంగానీ, ఎవరూ గాయపడటంగానీ జరుగలేదు.

వంతెన కూలిన సమయంలో కాలువలో ప్రవాహం పెద్దగా లేకపోవడం, ఎవరూ నీళ్లలో పడిపోకుండా కూలిన వంతెనపైనే ఉండ‌డంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హ‌ల్‌చ‌ల్ అవుతోంది. గుజ‌రాత్‌, యూపీ ఘ‌ట‌న‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement