Sunday, May 5, 2024

ఏపీలో కొత్తగా 2,982 కరోనా కేసులు.. 27 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,982 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కరోనా మహమ్మారికి మరో 27 మంది బలైనట్లు వెల్లడించింది. తాజాగా కరోనా నుంచి కోలుకుని 3,461 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకూ 12,946 మంది చనిపోయినట్లు వివరించింది. మొత్తం కరోనా కేసులు 19,11,318గా ఉన్నాయి. మొత్తం 18,66,522 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 31,850 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

జిల్లాల వారీగా కరోనా కేసులు:
శ్రీకాకుళం 92, విజయనగరం 50, విశాఖ 120, తూ.గో. 616, ప.గో. 363, కృష్ణా 298, గుంటూరు 242, ప్రకాశం 345, నెల్లూరు 208, చిత్తూరు 401, అనంతపురం 95, కర్నూలు 32, కడప 120

Advertisement

తాజా వార్తలు

Advertisement