Saturday, May 11, 2024

ఏపీలో కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 84,224 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16,167 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16,43,557కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 10,531కు చేరింది. కొత్తగా 21,385 మంది కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 14,46,244కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,86,782 యాక్టివ్ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కరోనా కేసులు: శ్రీకాకుళం-679, విజయనగరం-562, విశాఖ-1,434, తూ.గో.-2,325, ప.గో.-1,092, కృష్ణా-682, గుంటూరు-991, ప్రకాశం-1,069, నెల్లూరు-1,137, చిత్తూరు-2,967, అనంతపురం-1,472, కడప-776, కర్నూలు-981.

Advertisement

తాజా వార్తలు

Advertisement