Sunday, April 28, 2024

హెచ్‌పీసీఎల్‌లో ఘరానా చోరీ

విశాఖలోని హెచ్ పీసీఎల్ లో భారీ చోరీ జరిగింది. ప్లాంట్ లో రిఫైనరీ నిర్మాణానికి ఉపయోగించే ఇంజనీరింగ్ మెటీరియల్ మాయం అయ్యింది. రూ. 16 లక్షల విలువ చేసే 2.5 టన్నుల ఇంజనీరింగ్ మెటీరియల్ చోరీకి గురైయింది. దీంతో కాంట్రాక్టు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సబంధించి ఏడుగురుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు మల్కాపురం పోలీసులు. నిందితులంతా  పాత నేరస్తులుగా గుర్తించారు.చోరీ చేసిన ఇంజనీరింగ్ మెటీరియల్ ను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇటీవలే హెచ్పీసీఎల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement