Monday, April 29, 2024

జూన్ 30నుంచి అమ‌ర్ నాథ్ యాత్ర ప్రారంభం

యాత్రికులకు అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. జూన్‌ నుంచి 30 యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు సమావేశం జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సారి అమర్‌నాథ్‌ యాత్రను జూన్‌ 30న ప్రారంభించి, సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్‌ రోజుతో యాత్రను ముగించాలని నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 43 రోజుల పాటు మంచులింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అయితే, కొవిడ్‌ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ అవ‌కాశాన్ని యాత్రికులు వినియోగించుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement