Friday, March 29, 2024

స్విస్​ ఓపెన్​ బ్యాడ్మింట‌న్ టోర్నీ​ విజేతగా పీవీ సింధు

భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు స్విస్ ఓపెన్ బ్యాడ్మింట‌న్ టోర్నీ విజేత‌గా నిలిచింది. ఇటీవల జరిగిన జర్మన్​ ఓపెన్​, ఆల్​ఇంగ్లాండ్​ ఓపెన్​లో ఓడిన పీవీ సింధు స్విస్​ ఓపెన్​లో అదరగొట్టింది. ఈరోజు జరిగిన ఫైనల్​లో బుసానన్‌పై 21-16,21-8తేడాతో విజయం సాధించి టైటిల్​ను గెలుచుకుంది. 49 నిమిషాల పాటు సాగిందీ మ్యాచ్​. దీంతో ఈ ఏడాది ఆమె ఖాతాలో రెండు టైటిల్స్​ చేరాయి. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగానూ పీవీ సింధు గెలిచిన విష‌యం విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement