Tuesday, May 21, 2024

Movie Time | స్నేహారెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన అల్లు అర్జున్​.. అందుకోసమేనా?

పుష్ప‌రాజ్ నీ య‌వ్వ త‌గ్గేదేలే అంటూ.. పుష్ప సినిమాలో మాస్ ఫైర్ పుట్టించిన అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్త‌మ న‌టుడిగా పుర‌స్కారం దక్కింది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో రేపు (మంగ‌ళ‌వారం) సాయంత్రం జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమంలో అవార్డు అందుకునేందుకు అల్లు అర్జున్ సతీసమేతంగా ఢిల్లీ బయల్దేరారు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులను కెమెరాలు క్లిక్ మనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా రిలీజైన కొన్ని నెలల పాటు పాన్ ఇండియా లెవల్లో బన్నీ పేరు మార్మోగిపోయింది. మళ్లీ జాతీయ అవార్డు ప్రకటనతో మరోసారి నేషనల్ లెవల్లో ఐకాన్ స్టార్ కోలాహలం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement