Monday, April 29, 2024

Breaking: తుపాను వార్తలన్నీ ఉత్తవే.. పుకార్లను నమ్మొద్దన్న భారత వాతావరణ విభాగం

బంగాళాఖాతంలో 20వ తేదీ నుంచి అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమేపీ బలపడి పెను తుపానుగా మారుతుందన్న వార్తా కథనాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) స్పందించింది. సూపర్ సైక్లోన్ గురించి జరుగుతున్న ప్రచారం వట్టి పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది. ఆ తుపానుకు ‘సిత్రాంగ్’ అని నామకరణం చేసినట్టు వస్తున్న వార్తల్లోనూ నిజంలేదని పేర్కొంది. దీనిపై ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.మహాపాత్ర స్పందించారు.

బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడుతుందని, అది భారత తీరాన్ని తాకుతుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. సూపర్ సైక్లోన్ కు సంబంధించి తాము ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని వెల్లడించారు. కాగా, కెనడాలోని సస్కాచెవాన్ యూనివర్సిటీలో వాతావరణ శాస్త్రంలో పీహెచ్ డీ చేస్తున్న ఓ విద్యార్థి బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడనుందని అంచనాలు వెలువరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి వార్తులు ప్రచారంలో ఉన్నాయని, దీనికంతటికీ కారనం అదేనని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement