Thursday, May 2, 2024

Big Breaking: Z సెక్యూరిటీ వ‌ద్దు.. సామాన్యుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌న‌ప్పుడే నాకు ఇవ్వండి: ఒవైసీ

ఎఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనకు కేంద్ర కేటాయించి జడ్త సెక్నయూరిటీని తిరస్కరించారు. కారుపై కాల్పుల ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిందితులపై టెర్రర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించిన‌ప్పుడే త‌న‌కూ భ‌ద్ర‌త కావాల‌ని ఇవ్వాల పార్ల‌మెంట్‌లో చెప్పారు.

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. జెడ్-కేటగిరీ భద్రత తనకు అక్కర్లేదని అన్నారు. అంతకుముందు రోజు ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎంపీ కారుపై దాడి జరగడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ‘‘ఎవరు వారిని మొబిలైజ్ చేస్తున్నారు అనేది నా ప్రశ్న. దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పరిస్థితిని సమీక్షించడానికి నేను దీనిని ప్రభుత్వానికి వదిలివేస్తున్నాను’’ అని ఒవైసీ లోక్ సభలో అన్నారు. ఇటీవల హరిద్వార్, రాయ్‌పూర్,  ప్రయాగ్‌రాజ్‌లలో నిర్వహించిన ధర్మ సంసద్‌లలో తనకు వ్యతిరేకంగా చేసిన ‘ప్రేరేపిత ప్రసంగాలను’ పరిశీలించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

“నాకు జెడ్ కేటగిరీ భద్రత వద్దు. నేను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నా, ఊపిరాడకుండా ఉండాలని నేను అనుకోవడం లేదు. అట్లాంటి పరిస్థితిని ఎప్పటికీ కోరుకోను. మత విద్వేషాన్ని అంతం చేయండి” అని కోరుతూనే.. పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతలో లోపం జరిగినప్పుడు కూడా తాను ఖండించానని.. ఇలా ఎవరికీ జరగకూడదన్నదే తన అభిప్రాయమన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement