Friday, April 26, 2024

ఇదో స్పెష‌ల్‌ మాస్క్.. కరోనా వైర‌స్‌ని క‌చ్చితంగా అడ్డుకుంటుంది…

కరోనా వ్యాప్తి ప్రపంచ దేశాలకు సవాల్ గా మారింది. ఈ తరుణంలో క‌రోనాని ఎదుర్కొనేందుకు పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. అయితే.. ప్ర‌పంచ దేశాల‌ను వణికిస్తున్న మహమ్మారిని అడ్డుకునేందుకు భారతీయ పరిశోధకులు వినూత్నమైన మాస్క్ ను త‌యారు చేశారు. ఇది క్రిమిసంహారక మాస్క్.. ప్రమాదకర వైరస్, బ్యాక్టీరియా క్రిములను చంపగల సత్తా ఈ మాస్క్ కు ఉంది. మానవాళికి ముప్పుగా మారిన కొవిడ్ వైరస్ ను ఈ మాస్క్ సమర్థంగా ఎదుర్కొంటుందని పరిశోధనలో తేలింది. పైగా ఈ మాస్కులు పర్యావరణానికి ఎలాంటి హాని చేయవని, భూమిలో సులువుగా కలిసిపోతాయేలా త‌యారు చేసిన‌ట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఈ మాస్కుపై రాగి పూత పూస్తారు. తద్వారా వైరస్ లు ఈ పొరను దాటుకుని రాలేవు. ఈ మాస్కు ధరిస్తే శ్వాస తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

కాగా, ఈ రాగి ఆధారిత మాస్కు తయారీలో ఇంటర్నేషనల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్ సీఐ), సీఎస్ఐఆర్, సీసీఎంబీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు బెంగళూరుకు చెందిన రెసిల్ కెమికల్స్ అనే ప్రైవేటు సంస్థ కూడా భాగస్వామ్యం అయ్యింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ప్రాయోజిత నానో మిషన్ ప్రాజెక్టులో భాగంగా ఈ సరికొత్త మాస్కును డెవలప్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement