– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
బంగారు ఆభరణాలు, నాణేలు, బార్ల డిమాండ్ దేశంలో ఎక్కువే ఉంటుంది. సాధారణంగా – ప్రపంచంలోనే భారత్ బంగారం కొనుగోలులో రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉంది.- అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు. వచ్చే వారం నుండి ప్రారంభమయ్యే ధన్తేరస్, దీపావళితో సహా పండుగల ద్వారా బంగారం అమ్మకాలు పెరుగుతాయని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి.
ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా మహమ్మారి కొనసాగిన రెండేళ్ల తర్వాత బంగారం కొనుగోళ్లు పుంజుకోవడంతో గత ఏడాది చివరి త్రైమాసికంలో దేశంలో ఆభరణాల అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇక.. గ్లోబల్ మార్కెట్లలో బంగారం 0.1శాతం పెరిగి ఔన్సుకు 1,35,821.57 రూపాలకి చేరుకుంది. అయితే.. ఈ లాభనష్టాల మధ్య హెచ్చుతగ్గులున్నాయి.
రూపాయితో పోలిస్తే డాలర్ ధర పెరగడంతో గత మార్చి నుండి బులియన్ దాదాపు 20% పడిపోయిందని తెలుస్తోంది. సాధారణంగా డాలర్ రేటు పెరగడం కూడా బంగారం అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపింది. కొన్ని రోజుల నుండి బలహీనంగా ట్రేడింగ్ అవుతున్న బంగారంతో పాటు వెండి ధర కూడా బాగా దెబ్బతిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.