Sunday, May 19, 2024

‘ముక్తార్ అన్సారీ’ అక్రమ ఆస్తులు, కోట్ల విలువైన భూములు స్వాధీనం

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాఫియా, బాహుబలిల అక్రమ సంపాదనపై అణచివేత కొనసాగుతోంది. బాహుబలి ముఖ్తార్ అన్సారీ , అతని కుటుంబ సభ్యుల అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు, అక్రమ ఆస్తుల జప్తుపై కూడా చర్యలు కొనసాగుతున్నాయి. ఘాజీపూర్‌లో ముఠా నాయకుడు ముఖ్తార్ అన్సారీ భార్య హోటల్ భూమిని .. ఎస్‌డిఎం సదర్, సిఓ సదర్‌లతో కలిసి భారీ బలగాలతో స్వాధీనం చేసుకున్నారు.సదర్ కొత్వాలిలోని మహుబాగ్‌లో ముఖ్తార్ అన్సారీ భార్య అఫ్షాన్ అన్సారీకి చెందిన గజల్ హోటల్ వెనుక భాగానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఈ చర్య తీసుకున్నారు. గ్యాంగ్‌స్టర్ చట్టంలోని సెక్షన్ 14(1) కింద, ఐఎస్ 191 ముఠా నాయకుడు ముఖ్తార్ అన్సారీ భార్య అఫ్షాన్ అన్సారీకి చెందిన మహుబాగ్‌లోని భూమి (ప్లాట్) స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విస్తీర్ణం 381 చదరపు మీటర్లు అని జిల్లా మేజిస్ట్రేట్ ఎంపీ సింగ్ తెలియజేసినట్లు సదర్ సీఓ ఓజస్వీ చావ్లా తెలిపారు. దీని మార్కెట్ ధర దాదాపు రూ. 2 కోట్ల, 15 లక్షల రూపాయలు. సదర్ తహశీల్దార్‌, కొత్వాల్‌ విమలేష్‌ మౌర్యతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా, పురుషులు ఈ ఆస్తుల స్వాధీనం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement