Monday, April 29, 2024

Breaking: హైద‌రాబాద్‌లో యాక్సిడెంట్‌.. పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ఒక‌దానికొక‌టి ఢీకొన్న అయిదు కార్లు

హైద‌రాబాద్‌లో ఇవ్వాల (శ‌నివారం) రాత్రి యాక్సిడెంట్ జ‌రిగింది. మెహిదీప‌ట్నం నుంచి ఆరాంఘ‌ర్ వెళ్లే దారిలో ఉన్న పీవీ ఎక్స్‌ప్రెస్ వైపై వెళ్తున్న కార్లు ఒక్క‌సారిగా ప్ర‌మాదానికి గుర‌య్యాయి. ముందు వెళ్తున్న కారు స‌డెన్ బ్రేక్ వేయ‌డంతో దాని వెన‌కాలే వ‌స్తున్న కార్లు ఒక‌దానికొక‌టి ఢీకొట్టుకున్నాయి. దీంతో అయిదు కార్లు బాగానే డ్యామేజ్ అయిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘ‌ట‌న‌లో కొంత‌మందికి స్వ‌ల్ప గాయాలే అయ్యాయ‌ని ప్రాణ‌న‌ష్టం ఏమీ జ‌ర‌గ‌న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement