Monday, April 29, 2024

ఆ రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ.. ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటినవారికి ఉచితంగా టీకా అందించనున్నట్లు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు సమావేశమైన రాష్ట్ర కేబినెట్​.. కొవిడ్​ నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనాను మరింత సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రధాని నిర్ణయం ఉపకరిస్తుంద నీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారీ వ్యాక్సినేషన్​ ద్వారా వైరస్​కు అడ్డుకట్ట వేయవచ్చు పేర్కొన్నారు. 18ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా టీకా అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్​ పంపిణీ చేయడానికి అనుమతించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం యోగి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement