Friday, March 29, 2024

24 గంటల్లో 2020 మరణాలు.. ఇండియా, తెలంగాణలో కరోనా బీభత్సం

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. 2 లక్షల 94వేల కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. మరోవైపు కరోనా తో ఒక్క రోజులోనే కరోనాతో 2,020 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలో అత్యధికంగా.. 62,097 కేసులు వచ్చాయి. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇక మొత్తం మృతుల సంఖ్య 1,82,570కి చేరింది. దేశంలో 21 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరోవైపు తెలంగాణ‌లో గ‌డిచిన 24గంట‌ల్లో 1,30,105మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా మ‌రో 6,542 మందికి వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. మ‌రో 6,242మంది రిపోర్ట్ రావాల్సి ఉంది. కొత్త‌గా చికిత్స పొందుతూ మ‌రో 20మంది మ‌ర‌ణించారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 3,67,901కి చేరుకుంది. అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య 46,488 కి చేరింది. 3,19,537 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement