Saturday, April 27, 2024

న‌రేష్ – ప‌విత్ర లోకేష్ వ్య‌వ‌హారంలో కీల‌క మ‌లుపు..

న‌టులు పవిత్ర లోకేష్ – నరేష్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ట్రోలింగ్ ఆపాలంటూ పవిత్ర లోకేష్ – నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలు యూట్యూబ్ ఛానళ్ల‌కు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. నటుడు నరేష్ మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తమను ట్రోలింగ్ చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొంతమంది వ్యక్తులపై ఆయన క్రిమినల్ డిఫర్మషన్ వేశారు. దీంతో 12 మందిపై విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement