Tuesday, May 21, 2024

CRIME: నిజామాబాద్ లో దారుణం.. పండ్ల రసం ఇప్పిస్తానని బాలికపై అత్యాచారం

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో దారుణ ఘటన జరిగింది. పండ్లరసం కొనిస్తానని చెప్పి.. తొమ్మిదేళ్ల బాలికపై ఓ యవకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఈనెల 22 జరిగింది. స్థానికుడు నారాయణ పండ్ల రసం కొనిస్తానని చెప్పి… బాలికను కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పులు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నారాయణపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement