Sunday, April 28, 2024

Breaking: ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టుల లొంగుబాటు..

ఛత్తీస్‌గఢ్‌లోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అయిన సుక్మా జిల్లాలో తొమ్మిది మంది మహిళా కార్యకర్తలతో సహా మొత్తం 43 మంది నక్సల్స్‌ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఒక అధికారి తెలిపారు.

సుక్మా జిల్లాలోని పది గ్రామాలకు చెందిన 43 మంది కార్యకర్తలు సుక్మా పట్టణంలోని సీనియర్ పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారుల ముందు లొంగిపోయారు. మావోయిస్ట్ భావజాలంతో తాము నిరాశ చెంది లొంగిపోతున్నట్టు తెలిపారని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ శర్మ చెప్పారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో పొడియామి లక్ష్మణ్ అనే మిలీషియా కమాండర్ తలపై ₹1 లక్ష రివార్డు ఉంది. మిగిలిన అల్ట్రాలు మిలీషియా సభ్యులుగా.. దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘాన్ (DAKMS), క్రాంతికారి మహిళా ఆదివాసీ సంస్థాన్ (KAMS), చేతనా నాట్య మాండ్లీ (CNM)- మావోయిస్టుల అన్ని ఫ్రంటల్ వింగ్‌లు, దక్షిణ బస్తర్‌లోని వివిధ ప్రాంతాలలో చురుకుగా ఉన్నారు.

లొంగిపోయిన అల్ట్రాలు కూడా నక్సల్స్ కోసం జిల్లా పోలీసు పునరావాసం కోసం చేపట్టిన ‘పునా నర్కోమ్’ (స్థానిక గోండి మాండలికంలో కొత్త డాన్ అని అర్ధం) అని పిలవబడే పునరావాస డ్రైవ్‌తో “ఆకట్టుకున్నారని” ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన నక్సల్స్ కు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం ప్రకారం సౌకర్యాలు కల్పించనుంది. తాజా లొంగుబాటుతో ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించిన ‘పునా నార్కోమ్’ ప్రచారం కింద జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 176 మంది నక్సల్స్ హింసను విరమించుకున్నారని ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement