Thursday, May 2, 2024

Breaking: ఎస్టీ గురుకులంలో కరోనా కలకలం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులకు కరోనా బారిన పడటం కలకలం రేపింది. కాటారం మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో నలుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితమే పునఃప్రారంభమైన గురుకులానికి విద్యార్థులు చేరుకోగా.. మూడు రోజుల క్రితం జలుబు, జ్వరం బారిన పడ్డారు. దీంతో ప్రిన్సిపాల్ రాజేందర్ పీహెచీసి వైద్యాధికారి డాక్టర్ రామారావును సంప్రదించారు. ఈ క్రమంలో తొమ్మిది, పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ బారిన పడిన వారిలో ఒకరు తొమ్మిదో తరగతి విద్యార్థి కాగా.. ఇద్దరు పదో తరగతి, మరో విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. విద్యార్థులు కరోనా బారిన పడటంతో వారి ఇళ్లకు పంపారు. మిగతా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement