Wednesday, May 15, 2024

ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

ములుగు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. మ‌రో న‌లుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ రోజు ఉదయం ములుగు జిల్లాలోని ఎర్రి గ‌ట్ట‌మ్మ వ‌ద్ద ఆటోను డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న న‌లుగురు ప్ర‌యాణీకులు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్షతగాత్రులను వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రికి పోలీసులు త‌ర‌లించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement