Saturday, May 4, 2024

Breaking: సూడాన్ లో విషాద ఘటన.. బంగారం గని కూలి 38 మంది మృతి

ఆఫ్రికాలోని సూడాన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. బంగారం గని కూలి 38 మంది మృతి చెందారు. మరి కొంతమందికి గాయాలు అయ్యాయి. సూడాన్ రాజధాని ఖార్టోమ్ కు 700 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, మూసివేసిన బంగారం గనిలో ఈ ఘటన జరిగినట్లు సూడాన్ మైనింగ్ కంపెనీ వెల్లడించింది. కొంత కాలం క్రితం ఈ గని తవ్వాన్ని ప్రభుత్వం మూసివేసింది. అయితే, బంగారం కోసం స్థానిక ప్రజలు తరుచుగా గనిలోకి వెళ్తున్నారు. దీంతో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement