Tuesday, May 7, 2024

దేశంలో కొత్తగా 3038 కరోనా కేసులు..

దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సంఖ్య మరింత పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3038 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,29,284 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2069కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 94. 87 శాతంగా ఉంది. ఇక దేశంలో తొమ్మిది మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,901 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2069 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,77,204 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement