Thursday, May 2, 2024

‘స్వ‌ర్ణ‌భారత్’ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం..వెంక‌య్య‌ని కొనియాడిన అమిత్ షా..

స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్ 20వ వార్షికోత్స‌వ వేడుక‌లు నెల్లూరులో జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సేవ చేసే అవకాశం కొందరికే వస్తుంది..స్వర్ణభారత్ సేవలు చిరస్మరణీయంగా నిలోచిపోతాయన్నారు.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు క్రమశిక్షణ, నిబద్ధత కు మారు పేరని కొనియాడారు. బిజెపి కార్యకర్తలు వెంక‌య్య‌నాయుడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌న్నారు.. బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్రమంత్రి, ఉపరాష్ట్రపతి ఏ పదవిలో ఉన్నా వాటికి వన్నె తెచ్చిన వ్యక్తి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన నమ్మే విలువలే ఆయ‌న్ని ఈస్థాయికి తీసుకువచ్చాయి..స్వర్ణభారత్ ఆలోచన ఆయన లోని గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని కొనియాడారు. రైతులకు, పేదలకు, విద్యార్థులకు అండగా నిలుస్తున్న స్వర్ణభారత్ కి అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement