Monday, April 29, 2024

2022లో మా ఇంటికి వ‌చ్చిన అతిథి ‘మిస్ట‌ర్ క‌రోనా’ – మీనా పోస్ట్

క‌రోనా సృష్టిస్తున్న క‌ల్లోలం అంతా ఇంతా కాదు. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డ్డారు. ఇంకా ప‌డుతున్నారు కూడా. కాగా సీనియ‌ర్ హీరోయిన్ మీనా త‌న కుటుంబం మొత్తానికి క‌రోనా వ‌చ్చిన‌ట్టు చెప్పారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో పోస్ట్ ని పెట్టారు. 2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దాన్ని ఉండనివ్వను. ప్రజలారా జాగ్రత్త. భద్రంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకూ చోటివ్వండి’’ అంటూ ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement