Tuesday, May 7, 2024

20శాతం మంది ఉద్యోగుల‌ని తొల‌గించ‌నున్న‌.. యాహూ

ఈ మ‌ధ్య కాలంలో పెద్ద పెద్ద సంస్థ‌ల్లో ఉద్యోగుల తొల‌గింపు ప్ర‌క్రియ‌లు కొన‌సాగుతున్నాయి. కాగా ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ 2021లో యాహూను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 5 బిలియన్ డాలర్లతో యాహూను అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ చేజిక్కించుకుంది. కాగా యాహూ సంస్థ.. 20 శాతం మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ప్రకటించింది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించినట్టు పేర్కొంది. సంస్థ ప్రకటనల విభాగంలో అత్యధికంగా 50 శాతం మంది ప్రభావితం కానున్నారని చెప్పింది. అంతేకాకుండా.. ఈ వారం సుమారు వెయ్యి మందిని తొలగించొచ్చని పేర్కొంది. ఉద్యోగుల తొలగింపుల తరువాత తమ దృష్టిని పూర్తిగా డిమాండ్ సైడ్ ప్లాట్‌ఫామ్ వ్యాపారంపై కేంద్రీకరించే అవకాశం కలుగుతుందని యాహూ ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement